అండగా ఉంటాం

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ అండగా ఉంటామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు. పులివెందుల పంచాయతీతో రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేయొద్దని, టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు [more]

Update: 2019-10-03 14:59 GMT

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ అండగా ఉంటామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు. పులివెందుల పంచాయతీతో రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేయొద్దని, టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. గుంటూరు టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ నేతలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. వైసీపీ నేతలు ప్రజలు ఛీకొట్టేలా చేసుకోవద్దని, వైసీపీ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోందని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలపై ఏ సెక్షన్ కింద కేసులు పెడుతున్నారో చెప్పాలని, లేకుంటే పోలీసుల్ని దోషులుగా నిలబెడతామన్నారు. టీడీపీ సామాజిక కార్యకర్తలపైనే కేసులు పెడుతున్నారని, ప్రజలే తిరుగుబాటు చేసే పరిస్థితి తీసుకొస్తామని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని లక్షల మందిని అరెస్ట్‌ చేస్తారో చూస్తామన్నారు.

 

Tags:    

Similar News