అమరావతిలో ఏసీ కూడా సరఫరా చేస్తాం

అమరావతి నగరంలో ఇంటింటికి గ్యాస్, కరెంటుతో పాటు ఏసీ కూడా సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇవాళ అమరావతిలో జేవియర్ లేబర్ రిలేషన్స్ [more]

Update: 2019-01-17 13:59 GMT

అమరావతి నగరంలో ఇంటింటికి గ్యాస్, కరెంటుతో పాటు ఏసీ కూడా సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇవాళ అమరావతిలో జేవియర్ లేబర్ రిలేషన్స్ ఇన్ స్టిట్యూషన్(ఎక్స్ఎల్ఆర్ఐ) సంస్థకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అమరావతి నగరం నాలెడ్జ్ ఎకనామీగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. సమర్థ నాయకత్వం ఉంటేనే ఏ రంగమైనా అభివృద్ధి చెందుతుందన్నారు. గతంలో స్టాండ్ బై ఏసీలు ఉండేవని, తర్వాత సెంట్రల్ ఏసీలు వచ్చాయని, ఇప్పుడు కరెంటు, గ్యాస్ మాదిరిగా అమరావతిలో ఇంటింటికి ఏసీ సరఫరా చేసే దిశగా ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన ప్రకటించారు.

Tags:    

Similar News