బిగ్ బ్రేకింగ్ : నాలుగో విడత లాక్ డౌన్ మినహాయింపులు ఇవే

మే 31వ తేదీ వరకూ లాక్ డౌన్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించి మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. [more]

Update: 2020-05-17 13:36 GMT

మే 31వ తేదీ వరకూ లాక్ డౌన్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించి మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మే 31 మెట్రో, విమాన సర్వీసులకు మినహాయింపు లేదు. కాలేజీలు, స్కూళ్లు, షాపింగ్ మాల్స్, స్విమ్మింగ్ పూల్స్్, రెస్టారెంట్లు, హోటల్స్ పై నిషేధం కొనసాగుతుంది. జన సమూహం ఎక్కువగా ఉన్న వాటికి మినహాయింపు లేదు. అంతరాష్ట్ర బస్సు సర్వీసులు నడపాలనుకుంటే ఇరు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరాని చెప్పింది. అన్ని రాష్ట్రాలు ప్రజా రవాణాను పునరుద్ధరించుకోవచ్చు. రాజకీయ, సామాజిక సభలపై నిషేధం కొనసాగుతుంది. కంటెయిన్మెంట్ జోన్ లలో మాత్రం ఆంక్షలను కఠినంగా అమలు పర్చనున్నారు. రాత్రి 7గంటల నుంచి ఉదయం 7గంటల వరకూ దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ అమలో ఉంటుందని పేర్కొంది. అంతరాష్ట్ర బస్సు సర్వీసులు నడపాలంటే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Tags:    

Similar News