బ్రేకింగ్ : రాజధానిని ఎక్కడైనా పెట్టొచ్చు.. కేంద్రం క్లారిటీ

రాజధాని పై కేంద్రప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. గత జీవో ప్రకారం ఏపీ రాజధాని అమరావతిలో ఉందని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వైసీపీ మూడు రాజధానులను ఏర్పాటు చేస్తోందని, [more]

Update: 2020-02-04 08:38 GMT

రాజధాని పై కేంద్రప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. గత జీవో ప్రకారం ఏపీ రాజధాని అమరావతిలో ఉందని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వైసీపీ మూడు రాజధానులను ఏర్పాటు చేస్తోందని, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్ సభలో ప్రశ్నించారు. జయదేవ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ మూడు రాజధానుల అంశం తమ దృష్టికి రాలేదని, రాజధానుల ఏర్పాటు రాష్ట్ర పరిధిలోనిదేనని చెప్పడం గమనార్హం. దీంతో కేంద్ర ప్రభుత్వ జోక్యం మూడు రాజధానుల అంశంలో జోక్యం చేసుకోదని అర్థమయిపోయింది.

Tags:    

Similar News