జగన్ ను కలసిన రైతులు ఏమన్నారంటే?

అమరావతి ప్రాంత రైతుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని జగన్ తమకు హామీ ఇచ్చారని రాజధాని ప్రాంత రైతులు చెప్పారు. అమరావతిలో అభివృద్ధి చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. [more]

Update: 2020-02-04 11:53 GMT

అమరావతి ప్రాంత రైతుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని జగన్ తమకు హామీ ఇచ్చారని రాజధాని ప్రాంత రైతులు చెప్పారు. అమరావతిలో అభివృద్ధి చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. దాదాపు 30 మంది రైతులు జగన్ ను కలిశారు. భూములను బలవంతంగా తీసుకోమని జగన్ హామీ ఇచ్చారన్నారు. తాడేపల్లి, మంగళగిరిని మున్సిపాలిటీని చేస్తామని జగన్ హామీ ఇచ్చారని రైతులు చెప్పారు. ఈ ప్రాంతంలో ఉన్న అనేక సమస్యలకు పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. కొన్ని గంటల పాటు తమతో కలసి సమస్యలను వివరించిన ముఖ్యమంత్రి జగన్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఉండవల్లి, తాడేపల్లి ప్రాంత రైతులు జగన్ ను కలసిన వారిలో ఉన్నారు. మూడు పంటలు పండే భూములను తమకు దక్కితే చాలు అని వారు కోరారు.

Tags:    

Similar News