చంద్రబాబు ఆ ఐదేళ్లు ఏం చేశారో చెప్పాలి?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య ఫైర్ అయ్యారు. జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి ఏమీ లేదన్న చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన ఖండించారు. వైసీపీ మీద [more]

Update: 2021-04-11 02:05 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య ఫైర్ అయ్యారు. జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి ఏమీ లేదన్న చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన ఖండించారు. వైసీపీ మీద విమర్శలు చేసే ముందు తన హయాంలో ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలని సి.రామచంద్రయ్య ప్రశ్నించారు. దీనిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. పెట్టుబడుల పేరుతో హంగామా చేయడం తప్ప చంద్రబాబు సాధించిందేమీ లేదని సి.రామచంద్రయ్య ఎద్దేవా చేశారు. అమరావతిని సింగపూర్ గా మారుస్తానంటూ గ్రాఫిక్స్ కే పరిమితం చేశారని ఫైర్ అయ్యారు.

Tags:    

Similar News