వారు కలిస్తే చంద్రబాబుకు ఎందుకు భయం..?

వైసీపీ అధినేత జగన్ ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ కలిస్తే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఆయన [more]

Update: 2019-01-22 11:35 GMT

వైసీపీ అధినేత జగన్ ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ కలిస్తే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… పక్క రాష్ట్రాలతో సత్సంబంధాలు కలిగి ఉంటే తప్పేంటన్నారు. జగన్ తో కేవలం ఫెడరల్ ఫ్రంట్ అంశంపైనే కేటీఆర్ చర్చలు జరిపినట్లు స్పష్టం చేశారు. ఏపీలో 23 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని రాజ్యాంగానికి తూట్లు పొడిచిన చంద్రబాబు కలకత్తా వెళ్లి నీతులు మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు. వైసీపీ నవరత్నాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అన్నింటా విఫలమ్యారని, రాజధానిలో శాశ్వతం పేరుతో ఒక్క ఇటుక కూడా వేయలేదని, అన్నీ తాత్కాలికమే అని పేర్కొన్నారు. చంద్రబాబు, మంత్రులు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదన్నారు.

Tags:    

Similar News