కేశినేనిని ఆరోజే చెప్పుతో కొట్టాలనుకున్నా.. బుద్దా సంచలన కామెంట్స్

విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. రంగా హత్య కేసుల్లో నిందితులను వెంటేసుకుని కేశినేని నాని తిరుగుతున్నారన్నారు. నాని [more]

Update: 2021-03-06 07:26 GMT

విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. రంగా హత్య కేసుల్లో నిందితులను వెంటేసుకుని కేశినేని నాని తిరుగుతున్నారన్నారు. నాని వెంట ఉంటే మేం చంద్రబాబు ప్రచారంలో పాల్గొనేది లేదని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. చంద్రబాబును ఏకవచనంతో మాట్లాడినప్పుడే కేశినేని నానిని చెప్పుతో కొట్టాలనుకున్నానని బుద్దా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేశినేని నాని రెండు కాళ్లు విరగకొడతానన్నారు. తన వెంట ఉనన ఒక మనిషిని పంపితే చాలు నాని పని అయిపోతుందని బుద్దా ఫైర్ అయ్యారు. తాము సాయిరెడ్డితో పోరాడుతుంటే ఆయననే లంచ్ కు కేశినేని నాని పిలుస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తానే విజయవాడ ఎంపీగా పోటీ చేస్తానని చెప్పారు.

Tags:    

Similar News