ఇంత ఘోరంగా ఓడిపోతామనుకోలేదు

ప్రజలు ఇంత ఉదృతంగా మార్పు కోరుకుంటారని, ఇంతలా ఓడిపోతామని అనుకోలేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బుద్దా వెంకన్న పేర్కొన్నారు. ఫలితాలకు ముందు తాము కచ్చితంగా విజయం సాధిస్తామని [more]

Update: 2019-05-24 06:37 GMT

ప్రజలు ఇంత ఉదృతంగా మార్పు కోరుకుంటారని, ఇంతలా ఓడిపోతామని అనుకోలేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బుద్దా వెంకన్న పేర్కొన్నారు. ఫలితాలకు ముందు తాము కచ్చితంగా విజయం సాధిస్తామని తొడగొట్టి మరీ చెప్పిన వెంకన్న ఇవాళ ఫలితాలపై స్పందించారు. చంద్రబాబు నాయుడు చాలా మంచి వారని, రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేశారన్నారు. ఆయన గురించే తాను బాధపడుతున్నానని చెప్పారు. ఎమ్మెల్యేలపై విపరీతమైన వ్యతిరేకత ఉందని, కానీ మొహమాటంతో చంద్రబాబు వారిని మార్చలేకపోయారని అన్నారు. ఇదే సమయంలో జగన్ గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇచ్చారని అన్నారు. ప్రతిపక్షానికి కూడా కొన్ని ఎక్కువ స్థానాలు ఉంటే బాగుండేదని, 23 స్థానాలే రావడం బాధాకరమని అన్నారు.

Tags:    

Similar News