ఎక్కువ కేసులున్నాయని హైదరాబాద్ ను మారుస్తారా?

విశాఖలో కరోనా కేసులు తక్కువ చేసి ప్రభుత్వం లెక్కలు చూపుతుందన్న టీడీపీ విమర్శలకు మంత్రి బొత్స సత్యనారాయణ అభ్యంతరం తెలిపారు. ఎవరైనా కరోనా పాజిటివ్ కేసును దాచి [more]

Update: 2020-04-17 13:20 GMT

విశాఖలో కరోనా కేసులు తక్కువ చేసి ప్రభుత్వం లెక్కలు చూపుతుందన్న టీడీపీ విమర్శలకు మంత్రి బొత్స సత్యనారాయణ అభ్యంతరం తెలిపారు. ఎవరైనా కరోనా పాజిటివ్ కేసును దాచి పెట్టగలారా? అని బొత్స ప్రశ్నించారు. దాచి పెడితే ఏమవుతుందో తెలిసే టీడీపీ నేతలు ఇలాంటి పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. విశాఖ కు పరిపాలన రాజధానిని తరలించడానికే కేసులు తక్కువ చేసి చూపుతున్నారన్న టీడీపీ నేతల విమర్శలపై మండిపడ్డారు బొత్స సత్యనారాయణ. హైదరాబాద్ లో కేసులు ఎక్కువగా ఉన్నాయని రాజధానిని మారుస్తారా? అని ప్రశ్నించారు. లోకేష్, చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చుని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ప్రతిరోజు రెండువేల టెస్టులను నిర్వహిస్తామని చెప్పారు. రాయపాటి ఏవోవో మాట్లాడుతుంటారన్నారు.

Tags:    

Similar News