బాబుకు సమయం లేదు.. సందర్భం లేదు

సమయం, సందర్భం లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కరోనా సమయంలోనూ చంద్రబాబు తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని చెప్పారు. నగదు పంపిణీ కార్యక్రమంలో [more]

Update: 2020-04-06 08:00 GMT

సమయం, సందర్భం లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కరోనా సమయంలోనూ చంద్రబాబు తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని చెప్పారు. నగదు పంపిణీ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు పాల్గొంటే తప్పేమిటని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. తాము ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నట్లు గవర్నర్ కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడాన్ని తప్పుపట్టారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తుందన్నారు. ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. నిత్యావసరాల వస్తువుల ధరలు పెరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతులను, ఆక్వారంగాన్ని ప్రభుత్వ ఆదుకుంటుందని బొత్స చెప్పారు.

Tags:    

Similar News