బీజేపీపై భగ్గుమన్న బాబు

Update: 2018-05-19 07:41 GMT

కర్ణాటక పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారి బహిరంగంగా స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కర్ణాటకలో పరిస్థితి దారుణంగా ఉందని, అధికారం కోసం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు మోదీ, అమిత్ షా ఏం చెప్పారని, ఇప్పుడు అధికారం కోసం ఏమి చెస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అడుగడుగునా ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలు వెళ్లడానికి కనీసం విమానాలకు అనుమతి కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఇప్పటికే తమిళనాడును బ్రష్ఠుపట్టించారని, ఇప్పుడు కర్ణాటకను అలానే చేస్తున్నారని, ఇక ఆంధ్రప్రదేశ్ పై పడతారని చెప్పారు. తమ అధికార దాహం కోసం ఇలా చేయడం సరికాదని, అభివృద్ధి బాటలో ఉన్న రాష్ట్రాల్లో ఈ విధంగా చేయడం దారుణమని ఆయన పేర్కొన్నారు.ఏపీపై ప్రస్తుతం బీజేపీ కన్నేసిందని, శాంతిభద్రతలకు విఘాతం కల్గించాలని ప్రయత్నిస్తే మక్కెలిరగ్గొడతానని బాబు హెచ్చరించారు.

Similar News