సాగర్ బీజేపీ అభ్యర్థి ఈయనే

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. డాక్టర్ పానుగోతు రవికుమార్ పేరును ఖరారు చేస్తూ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. అనేక రోజులు సాగర్ అభ్యర్థిపై [more]

Update: 2021-03-30 01:23 GMT

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. డాక్టర్ పానుగోతు రవికుమార్ పేరును ఖరారు చేస్తూ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. అనేక రోజులు సాగర్ అభ్యర్థిపై కసరత్తు చేసిన బీజేపీ అధిష్టానం చివరకు రవికుమార్ పేరును ఖరారు చేశారు. ఈమేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటించారు. ఎస్టీ వర్గానికి చెందిన రవికుమార్ వైద్యుడిగా సాగర్ ప్రాంతంలో సుపరిచితుడు. ఇక్కడ ఆ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉండటంతో బీజేపీ రవికుమార్ కు అవకాశమిచ్చింది.

Tags:    

Similar News