బ్రేకింగ్ : వచ్చే నెల 2న బెజవాడలో లాంగ్ మార్చ్

ప్రతి పదిహేను రోజులకొకసారి జనసేన, బీజేపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించామని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఇకపై ఏ కార్యక్రమం చేపట్టినా రెండు [more]

Update: 2020-01-22 13:39 GMT

ప్రతి పదిహేను రోజులకొకసారి జనసేన, బీజేపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించామని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఇకపై ఏ కార్యక్రమం చేపట్టినా రెండు పార్టీలు కలసి చేయాలని నిర్ణయించామని చెప్పారు. రాజధాని రైతులకు అండగా నిలబడేందుకు ఒక స్పష్టమైన నిర్ణయం నేడు తీసుకున్నామని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఫిబ్రవరి 2వ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు తాడేపల్లి నుంచి విజయవాడ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకూ లాంగ్ మార్చ్ నిర్వహించాలని నిర్ణయించాయని తెలిపారు. రాజధాని రైతులకు న్యాయం జరిగే వరకూ బీజేపీ, జనసేన కలిసి పనిచేస్తాయని తెలిపారు. రాజకీయాల కోసం ఎక్కువ సమయం వెచ్చిస్తూ ప్రభుత్వం ప్రజావసరాలను పక్కన పెడుతున్నారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. రేపు ఉదయం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలుస్తామని జీవీఎల్ నరసింహారావు తెలిపారు.

Tags:    

Similar News