బ్రేకింగ్ : బీజేపీ కూడా జగన్ కు వ్యతిరేకంగా

సీడ్ క్యాపిటల్ అమరావతిలోనే ఉండాలని బీజేపీ కోర్ కమిటీ సమావేశం తీర్మానం చేసింది. అమరావతిలోనే రాజధానిని ఉంచాలని అభిప్రాయపడింది. పరిపాలన వికేంద్రీకరణ ముసుగులో జగన్ అరాచకాలు చేస్తున్నారన్నారు. [more]

Update: 2020-01-11 12:37 GMT

సీడ్ క్యాపిటల్ అమరావతిలోనే ఉండాలని బీజేపీ కోర్ కమిటీ సమావేశం తీర్మానం చేసింది. అమరావతిలోనే రాజధానిని ఉంచాలని అభిప్రాయపడింది. పరిపాలన వికేంద్రీకరణ ముసుగులో జగన్ అరాచకాలు చేస్తున్నారన్నారు. రాజధానిని మార్చే అధికారం జగన్ కు లేదన్నారు. రాజధానిని అమరావతిలోనే ఉంచాలంటూ బీజేపీ ఇకపై పోరాటం చేయాలని నిర్ణయించింది. తొలి నుంచి బీజేపీ చెబుతున్నది కూడా అదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో రాజధానిపై జగన్ తీసుకు వచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదనలను ఖండించారు. రాజధాని అమరావతిలోనే కొనసాగేలా తాము కార్యాచరణను సిద్ధం చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు.

Tags:    

Similar News