పల్లా ఆక్రమించిన భూముల విలువ 200 కోట్లు

టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు 48 ఎకరాల భూమిని ఆక్రమించారని మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. అందుకే ప్రభుత్వం వాటిని తిరిగి స్వాధీనం చేసుకుందన్నారు. పల్లా [more]

Update: 2021-06-13 05:51 GMT

టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు 48 ఎకరాల భూమిని ఆక్రమించారని మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. అందుకే ప్రభుత్వం వాటిని తిరిగి స్వాధీనం చేసుకుందన్నారు. పల్లా కుటుంబం యుఎల్ సి భూములను ఆక్రమించుకుందన్నారు. త్వరలోనే దీనిపై సిట్ నివేదిక కూడా ఇవ్వనుందని అవంతి శ్రీనివాస్ తెలిపారు. సామాన్యులను కాపాడే ప్రయత్నంలో భాగంగానే ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పారు. తెలుగుదేశం నేతల భూ ఆక్రమణలపై చంద్రబాబు స్పందించాలని అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పల్లా శ్రీనివాస్ కుటుంబం ఆక్రమించిన భూముల విలువ 200 కోట్లకు పైమాటేనని ఆయన తెలిపారు. భూములను ఆక్రమిస్తే ఏ పార్టీ నేతలనైనా వదిలిపెట్టే ప్రసక్తిలేదని అవంతి శ్రీనివాస్ తెలిపారు.

Tags:    

Similar News