తాను దూరాలన్నదే బాబు ప్రయత్నం

బీజేపీికి వైసీపీని దూరం చేసే కుట్ర జరుగుతుందని మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరోపించారు. బీజేపీ, వైసీపీ మధ్య చెడితే తాను దూరాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. గతంలో మోడీని [more]

Update: 2019-11-19 12:37 GMT

బీజేపీికి వైసీపీని దూరం చేసే కుట్ర జరుగుతుందని మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరోపించారు. బీజేపీ, వైసీపీ మధ్య చెడితే తాను దూరాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. గతంలో మోడీని ఇష్టమొచ్చినట్లు తిట్టిన చంద్రబాబు ఇప్పుడు పొగుడుతున్నారన్నారు. హిందూమతం పట్ల వైసీపీకి పూర్తి విశ్వాసం ఉందన్నారు. జగన్ ప్రభుత్వం హిందూ వ్యతిరేకి అని టీడీపీ ప్రచారం చేస్తుందన్నారు. దీనివల్ల బీజేపీ, ఆర్ఎస్ఎస్ కు వైసీపీని దూరం చేయాలని ప్రయత్నం టీడీపీ చేస్తుందని అవంతి శ్రీనివాస్ తెలిపారు. అందుకోసమే మతం కార్డును వాడుకుంటుందన్నారు. టీడీపీపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఘాటు విమర్శలు చేశారు. ఇటీవల టీడీపీ నేతలు మంత్రి అవంతి శ్రీనివాస్ అయ్యప్ప మాల వేసుకుని చెప్పులు వేసుకుని తిరుగుతున్నారని ఆరోపించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News