అశోక్ గెహ్లోత్ ప్రమాణస్వీకారం

Update: 2018-12-17 08:57 GMT

రాజస్థాన్ 12వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లోత్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్ లోని చారిత్రక ఆల్బర్ట్ హా లో గవర్నర్ కళ్యాణ్ సింగ్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, రాజస్థాన్ తాజా మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఓమర్ అబ్దుల్లా, వివిద పార్టీల నేతలు శరద్ పవార్, తేజస్వీ యాదవ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రధాని మోదీ... అశోక్ గెహ్లోత్, సచిన్ పైలట్ లకు శుభాకాంక్షలు తెలిపారు.

Similar News