అశోక్ అదే రూట్ లో వెళ్లారా..?

డేటా చోరీ కేసులో నిందితుడిగా ఉన్న ఐటీ గ్రిడ్స్ సీఈఓ అశోక్ కోసం సిట్ పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసు వెలుగులోకి రాగానే అశోక్ పారిపోయినట్లు గుర్తించారు. [more]

Update: 2019-03-11 13:22 GMT

డేటా చోరీ కేసులో నిందితుడిగా ఉన్న ఐటీ గ్రిడ్స్ సీఈఓ అశోక్ కోసం సిట్ పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసు వెలుగులోకి రాగానే అశోక్ పారిపోయినట్లు గుర్తించారు. అశోక్ కదలికలను, ఆయన ఎవరివరితో మాట్లాడారనే వివరాలను తెలంగాణ సిట్ గుర్తించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. డేటా చోరీ అంశం వెలుగు చూసిన కొన్ని గంటల్లోనే అశోక్‌ విజయవాడ వైపు వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి గుంటూరు సెల్‌ టవర్‌ లొకేషన్‌ చూపించినట్లు సమాచారం. విజయవాడ నుంచి గుంటూరు వెళ్లేలోగా కీలక అధికారులకు, రాజకీయ ప్రముఖలకు ఈ నంబర్‌ నుంచి కాల్స్‌ వెళ్లినట్టు తెలిసింది. ఇదే నంబర్లతో గత ఆరు నెలలుగా విస్తృతంగా అశోక్‌ మాట్లాడినట్లు కూడా అధికారులు గుర్తించారు. అశోక్ ఫోన్‌ మాట్లాడిన వారికి, ఈ కేసుకు ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలోనూ విచారణ చేయాలనే యోచనలో ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఇక, అశోక్ దాకవరపు ఏపీ సిట్‌ ముందుకు రానున్నట్లు సమాచారం.

Tags:    

Similar News