పరిషత్ ఎన్నికలపై హైకోర్టు లో విచారణ?

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై హైకోర్టులో వాదనలు ముగిసాయి. తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ నెల 10 వతేదీన పరిషత్ [more]

Update: 2021-04-16 01:18 GMT

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై హైకోర్టులో వాదనలు ముగిసాయి. తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ నెల 10 వతేదీన పరిషత్ ఎన్నికలు జరిగాయి. అయితే హైకోర్టులో విచారణ పెండింగ్ లో ఉండటంతో ఫలితాలను తీర్పు తర్వాతనే విడుదల చేయాలని హైకోర్టు సూచించింది. హైకోర్టు తీర్పు వెలువడితే తప్ప పరిషత్ ఎన్నికల ఫలితాలు తేలని పరిస్థితి. పోటీ చేసిన అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News