విశాఖపై పోలీస్ బాస్ ఆదేశం… కమిటీ ఏర్పాటు

మూడు రాజధానుల బిల్లులను గవర్నర్ ఆమోదించడంతో ఏపీ పోలీస్ శాఖ కూడా స్పీడ్ పెంచింది. విశాఖలో పోలీసు కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి ఒక కమిటీని నియమించింది. విశాఖ [more]

Update: 2020-08-01 05:53 GMT

మూడు రాజధానుల బిల్లులను గవర్నర్ ఆమోదించడంతో ఏపీ పోలీస్ శాఖ కూడా స్పీడ్ పెంచింది. విశాఖలో పోలీసు కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి ఒక కమిటీని నియమించింది. విశాఖ సిటీ పోలీసు కమిషనర్ నేతృత్వంలో మరో ఎనిమిది మంది సభ్యులతో కమిటీని నియమించారు. పోలీసు అవసరాలు, భద్రత, మౌలిక సదుపాయాల పరిశీలన కోసం ఈ కమిటీ అధ్యయనం చేయాల్సి ఉంది. ఈ కమిటీ రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని డీజీపీ గౌతం సవాంగ్ ఆదేశించారు.

Tags:    

Similar News