పోలవరం ప్రాజెక్టు వచ్చే ఏడాదికి పూర్తిచేస్తాం

2021 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఇందులో వెనక్కు వెళ్లేది లేదని చెప్పారు. తాము పూర్తి చేస్తామని చెప్పిన [more]

Update: 2020-12-02 06:38 GMT

2021 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఇందులో వెనక్కు వెళ్లేది లేదని చెప్పారు. తాము పూర్తి చేస్తామని చెప్పిన వెంటనే పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారని ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా ఎప్పుడూ పోలవరం ప్రాజెక్టును పట్టించుకోలేదన్నారు. ముంపు బాధితుల వైపు చూడలేదన్నారు. ప్రతి సోమవారం పోలవరం అంటూ డ్రామాలాడటమే చంద్రబాబుకు సరిపోయిందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. తాము ఎట్టి పరిస్థితుల్లో ఒక్క అంగుళం కూడా ఎత్తు తగ్గించబోమని మంత్రి స్పష్టం చేశారు. చంద్రబాబు 70 శాతం పోలవరం పూర్తయిందని చెప్పడం పచ్చి అబద్ధమని మంత్రి అనిల్ అన్నారు. తామే నిర్మిస్తామని చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును తీసుకోవడం స్వార్థ ప్రయోజనాలేనని మంత్రి అనిల్ తెలిపారు.

Tags:    

Similar News