బ్రేకింగ్ : తెలంగాణపై రివర్స్ ఫిర్యాదు చేసిన ఏపీ

వాటాకు మించి తెలంగాణ నీటిని వాడుకుంటుందని ఏపీ ఇరిగేషన్ అధికారులు కృష్ణా వాటర్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. విభజన చట్టానికి విరుద్ధంగా గత కొంతకాలంగా ప్రాజెక్టుల నిర్మాణం [more]

Update: 2020-05-18 12:45 GMT

వాటాకు మించి తెలంగాణ నీటిని వాడుకుంటుందని ఏపీ ఇరిగేషన్ అధికారులు కృష్ణా వాటర్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. విభజన చట్టానికి విరుద్ధంగా గత కొంతకాలంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందని వివరాలను అందించారు. ఈ ప్రాజెక్టులకు అపెక్స్ కమిటీ, సీడబ్ల్యూసీ అనుమతి కూడా లేదన్నారు. మిగులు జలాలు ఉన్నాయని తెలంగాణ ఐదు కొత్త ప్రాజెక్టులను చేపట్టిందని ఏపీ ఫిర్యాదులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వాడుకుంటున్న నీటి వివరాలను బోర్డుకు ఇచ్చింది. కొత్త ప్రాజెక్టుపై డీపీఆర్ ఇవ్వాలని తెలంగాణను కేంద్ర ప్రభుత్వం కోరినా ఇప్పటివరకూ ఇవ్వలేదని కూడా పేర్కొంది.

Tags:    

Similar News