ఈసారి రాకపోతే ఇక అంతే సంగతులు.. హైకోర్టు సీరియస్

విచారణకు గైర్హాజరయిన అధికారులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అఫడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నరేగా బిల్లుల చెల్లింపుపై నేడు హైకోర్టులో విచారణ [more]

Update: 2021-08-04 07:07 GMT

విచారణకు గైర్హాజరయిన అధికారులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అఫడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నరేగా బిల్లుల చెల్లింపుపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈవిచారణకు ప్రభుత్వం నుంచి అధికారులు ఎవరూ హాజరు కాలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు తదుపరి విచారణకు హాజరు కాకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హైకోర్టు హెచ్చరించింది. తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది.

Tags:    

Similar News