ఆగస్టు అంతా జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఈ నెలంతా బిజీబిజీగా గడపనున్నారు. ఈరోజు వైఎస్ జగన్ జెరూసెలం పర్యటన కు కుటుంబ సభ్యులతో కలసి వెళతారు. ఐదురోజుల పర్యటన అనంతరం [more]

Update: 2019-08-01 03:43 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఈ నెలంతా బిజీబిజీగా గడపనున్నారు. ఈరోజు వైఎస్ జగన్ జెరూసెలం పర్యటన కు కుటుంబ సభ్యులతో కలసి వెళతారు. ఐదురోజుల పర్యటన అనంతరం తిరిగి వచ్చిన వైఎస్ జగన్ ఈనెల 6వ తేదీన వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన రెండు రోజుల పాటు ఉండనుంది. ప్రధాని మోదీ, అమిత్ షా, రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడులను కలవనున్నారు. ఢిల్లి నుంచి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ పులివెందుల వెళ్లనున్నారు. ఈనెల 19వ తేదీన తిరిగి వైఎస్ జగన్ అమెరికాకు కుటుంబ సభ్యులతో కలసి వెళ్లనున్నారు. ఆగస్టు నెల మొత్తం జగన్ పర్యటనలతోనే ఎక్కువగా గడపనున్నారు.

Tags:    

Similar News