విశాఖకు చేరుకున్న జగన్ కు

కొద్దిసేపటి క్రితం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జగన్ కు వైసీపీ శ్రేణులు భారీ స్వాగతం పలికాయి. ఎయిర్ పోర్టు నుంచి [more]

Update: 2019-12-28 11:24 GMT

కొద్దిసేపటి క్రితం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జగన్ కు వైసీపీ శ్రేణులు భారీ స్వాగతం పలికాయి. ఎయిర్ పోర్టు నుంచి కైలాసగిరి వరకూ 24 కిలోమీటర్ల మేర మానవహారాన్ని ఏర్పాటు చేశారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రతిపాదించిన తర్వాత జగన్ తొలిసారి విశాఖ పర్యటనకు రావడంతో పార్టీ శ్రేణులతో పాటు, ప్రజలు కూడా పెద్ద యెత్తున వీధుల్లోకి వచ్చి థ్యాంక్యూ జగనన్న అంటూ నినాదాలు చేశారు. దాదాపు 24 కిలోమీటర్లు ఐదుగంటల సమయం పట్టింది. దారికి ఎడమవైపున మహిళలు, యువకులు ఎక్కువగా నిలబడి జగన్ కు స్వాగతం పలికారు. ఈరోజు విశాఖ ఉత్సవ్ ను జగన్ ప్రారంభించనున్నారు.

Tags:    

Similar News