టీడీపీకి షాక్..! వైసీపీలోకి మరో ఎమ్మెల్యే..?

ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఇప్పటికే టీడీపీని ఇద్దరు ఎమ్మెల్యేలు వీడగా, తాజాగా మరో ఎమ్మెల్యే పార్టీకి గుడ్ బై చెప్పే [more]

Update: 2019-02-05 06:18 GMT

ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఇప్పటికే టీడీపీని ఇద్దరు ఎమ్మెల్యేలు వీడగా, తాజాగా మరో ఎమ్మెల్యే పార్టీకి గుడ్ బై చెప్పే సూచనలు కనిపిస్తోంది. 2014లో ప్రకాశం జిల్లా చీరాల నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడే యోచనలో ఉన్నారు. ఈ మేరకు ఇవాళ ఆయన తన స్వగ్రామం పందిళ్లపల్లిలో ఆయన అనుచరులు, కార్యకర్తలతో సమావేశయ్యారు. ఆమంచి.. వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. ఇటీవలి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఆయన సన్నిహితులు. ఇప్పటికే ఆయనతో వైసీపీ నేతలు టచ్ లో ఉన్నారు. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఆయన జగన్ ను కలిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. అయితే, జనసేన నుంచి కూడా ఆమంచి కృష్ణమోహన్ కు ఆహ్వానం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News