బ్రేకింగ్ : రాజధాని భూ కుంభకోణం కేసులో మరొకరి అరెస్ట్

రాజధాని భూ కుంభకోణం కేసులో మరో అరెస్ట్ జరిగింది. రాజధాని అమరావతి ప్రాంతంలో పెద్దయెత్తున అవకతవకలు జరిగాయని ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. [more]

Update: 2020-06-09 12:33 GMT

రాజధాని భూ కుంభకోణం కేసులో మరో అరెస్ట్ జరిగింది. రాజధాని అమరావతి ప్రాంతంలో పెద్దయెత్తున అవకతవకలు జరిగాయని ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల డిప్యూటీ కలెక్టర్ మాధురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఆర్డీఏ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రణధీర్ ను సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. డిప్యూటీ కలెక్టర్ మాధురి వద్ద రణధీర్ కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేశారు. గత నాలుగు నెలల నుంచి రణధీర్ విధులకు హాజరుకావడం లేదు. విజయవాడలోని తన సొంత ఇంట్లో ఉండగా పోలీసులు రణధీర్ ను అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News