వారికి హైదరాబాద్ సీపీ వార్నింగ్

సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ఇచ్చే వారికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ లో ఎలాంటి ఘటనలు జరిగిన భారీ మూల్యం తప్పదంటూ [more]

Update: 2020-11-26 03:07 GMT

సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ఇచ్చే వారికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ లో ఎలాంటి ఘటనలు జరిగిన భారీ మూల్యం తప్పదంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆయన సీరియస్ అయ్యారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ప్రజలు విశ్వసించవద్దని అంజనీకుమార్ ప్రజలను కోరారు. కొందరు మత ఘర్షణలను సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, అటువంటి వారిపై పీడీ యాక్ట్ పెడతామని అంజనీ కుమార్ హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే ఎంతటి వారినైనా వదిలేది లేదని ఆయన తెలిపారు.

Tags:    

Similar News