వారిపై అనిల్ కుమార్ ఆగ్రహం.. కారణమిదే?

నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి అనిల్ కుమార్ ఆకస్మికంగా పర్యటించారు. అక్కడ కోవిడ్ బాధితులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. కోవిడ్ బాధితులకు సరైన వైద్యాన్ని అందించాలని, వారి [more]

Update: 2021-04-28 01:34 GMT

నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి అనిల్ కుమార్ ఆకస్మికంగా పర్యటించారు. అక్కడ కోవిడ్ బాధితులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. కోవిడ్ బాధితులకు సరైన వైద్యాన్ని అందించాలని, వారి పట్ల కరుణతో వ్యవహరించాలని అనిల్ కుమార్ కోరారు. ఒకే చోట వైద్య సిబ్బంది గుమికూడి ఉండటాన్ని అనిల్ కుమార్ తప్పుపట్టారు. కోవిడ్ నిబంధనలను ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తేవాలని అనిల్ కుమార్ కోరారు.

Tags:    

Similar News