తెలంగాణ నుంచి ఏపీకి ప్రత్యేక బస్సులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ నుంచి తమ ప్రాంత వాసులను రాష్ట్రానికి రప్పించేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనుంది. లాక్ డౌన్ కారణంగా అనేక మంది హైదరాబాద్ లో [more]

Update: 2020-05-14 01:57 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ నుంచి తమ ప్రాంత వాసులను రాష్ట్రానికి రప్పించేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనుంది. లాక్ డౌన్ కారణంగా అనేక మంది హైదరాబాద్ లో చిక్కుకుపోయారు. వారిని రప్పించేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికే ఈ బస్సుల్లో అనుమతి ఉంటుంది. రాష్ట్రానికి వచ్చిన వెంటనే క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది. అందుకు ఇష్టపడతేనే ఏపీికి రావచ్చు. ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యత క్రమంలో అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండు, మూడురోజుల్లో దీనిపై స్పష్టత రానుంది.

Tags:    

Similar News