ఒక్కరికే అనుమతి అంటున్న జగన్

బడ్జెట్ సమావేశాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరికాసేపట్లో బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరుకానున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి [more]

Update: 2019-07-10 04:32 GMT

బడ్జెట్ సమావేశాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరికాసేపట్లో బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరుకానున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి బీఏసీ సమావేశానికి అచ్చెన్నాయుడు, రామానాయుడు హాజరవుతారు. అయితే తెలుగుదేశం పార్టీకి శాసనసభలో ఉన్న సంఖ్యా బలాన్ని బట్టి ఒక్కరికే అనుమతి ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. బీఏసీ సమావేశాల్లో ప్రధాన మైన బిల్లులు, శాసనసభ సమావేశాలు జరిగే రోజులపై నిర్ణయం తీసుకుంటారు.రేపటి నుంచి ఆంధ్రప్రదవేశ్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.

Tags:    

Similar News