ఏపీ మరో కీలక నిర్ణయం.. నేటి నుంచి?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే రిజిస్ట్రేషన్ కార్యాలయాలను తెరవాలని నిర్ణయించింది. ఇప్పటికే ఆదాయం పెంచుకునేందుకు మద్యం షాపులను తెరిచారు. మరో [more]

Update: 2020-05-05 02:11 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే రిజిస్ట్రేషన్ కార్యాలయాలను తెరవాలని నిర్ణయించింది. ఇప్పటికే ఆదాయం పెంచుకునేందుకు మద్యం షాపులను తెరిచారు. మరో ఆదాయ మార్గమైన రిజిస్ట్రేషన్ కార్యాలయాలను కూడా తెరిస్తే ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ఆరెంజ్, గ్రీన్ జోన్లలో మాత్రమే తెరవాలని నిర్ణయించారు. నేటి నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయాల ఉద్యోగులు విధులకు హాజరు కావాలని, కార్యాలయాల్లో భౌతిక దూరం పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.

Tags:    

Similar News