బ్రేకింగ్ : జగన్ సర్కార్ కు మళ్లీ ఎదురుదెబ్బ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టేసింది. దీనిపై ఈ నెల [more]

Update: 2020-05-05 07:15 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టేసింది. దీనిపై ఈ నెల 19వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. జీవో నెంబరు 623 ను హైకోర్టు సస్పెండ్ చేయడంతో జగన్ ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. వైసీపీ రంగులు వేయడంపై ప్రజా ప్రయోజనం వ్యాజ్యంపై పిటీషన్ దాఖలయిన సంగతి తెలిసిందే. విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. సరైన వివరణ ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Tags:    

Similar News