నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక విషయాలపై?

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధనంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం, తెలంగాణ ప్రభుత్వం [more]

Update: 2021-06-30 02:53 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధనంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం, తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తుతున్న అభ్యంతరాలపై మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం అవసరం, దానిపై ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై ఈ సమావేశంలో చర్చించనున్నారని తెలిసింది. వీటతో పాటు ఐటీ పాలసీ, ఒంగోలు, విజయనగరం జిల్లాల్లో యూనివర్సిటీల ఏర్పాటు విషయంపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.

Tags:    

Similar News