5న ఏపీ బంద్.. అందరూ మద్దతిచ్చారు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ ఉక్కు పరిరక్షణ కమిటీ ఈ నెల 5వ తేదీ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను [more]

Update: 2021-03-02 01:08 GMT

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ ఉక్కు పరిరక్షణ కమిటీ ఈ నెల 5వ తేదీ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించేందుకే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, దీనిన అడ్డుకునేందుకు తొలి విడతగా బంద్ ను నిర్వహిస్తున్నామని కమిటీ పేర్కొంది. విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను అమ్ముకునేందుకే ఈ ప్రయివేటీకరణ ప్రతిపాదనను ముందుకు తెచ్చారన్నారు. ఇప్పటికే 5వ తేదీన జరిగే బంద్ కు అన్ని రాజకీయ పక్షాలు మద్దతిచ్చాయని, బంద్ ను విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని కమిటీ కోరింది.

Tags:    

Similar News