ఆనం రెడీగా ఉన్నారు....!

Update: 2018-09-02 06:40 GMT

మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మరికొద్దిసేపట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆయన నిన్ననే విశాఖపట్నం చేరుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం జగన్ పాదయాత్ర ముగిసిన తర్వాత ఆనం జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. నిన్న చోడవరంలోనే జగన్ ను రాత్రి శిబిరంలో కలసిన ఆనం రామనారాయణరెడ్డి రాజకీయ విషయాలపై చర్చించారు. ఆనం తన భవిష్యత్తు గురించి కూడా జగన్ తో మాట్లాడినట్ల తెలుస్తోంది. ఆనం రామనారాయణరెడ్డి తో పాటు ఆనం వివేకానందరెడ్డి తనయుడు రంగమయూర్ రెడ్డి మరికొందరు పార్టీలో చేరారు. చోడవరం సమీపంలోని దేవరాయపల్లి మండలం వ్యాసంన చెరకు కాటా సెంటర్లో ఆనం వైసీీపీ కండువా కప్పుకోనున్నారు.

Similar News