Amarinder : కొత్త పార్టీ ప్రకటన.. బీజేపీతోనే కలసి

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కొత్త పార్టీని ప్రకటించారు. పార్టీ విధివిధానాలను త్వరలోనే తెలియజేస్తానని చెప్పారు. తన పార్టీలోకి కాంగ్రెస్ నేతలు అనేక మంది వచ్చి [more]

Update: 2021-10-27 06:25 GMT

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కొత్త పార్టీని ప్రకటించారు. పార్టీ విధివిధానాలను త్వరలోనే తెలియజేస్తానని చెప్పారు. తన పార్టీలోకి కాంగ్రెస్ నేతలు అనేక మంది వచ్చి చేరబోతున్నారని అమరీందర్ ప్రకటించారు. తమ పార్టీ వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటుందని ప్రకటించారు. దీంతో పంజాబ్ రాజకీయాలు వేడెక్కాయి. రేపు అమరీందర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలసి పొత్తుపై చర్చించనున్నారు. పంజాబ్ లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అమరీందర్ కొత్త పార్టీ సంచలనంగా మారింది.

Tags:    

Similar News