అన్ని ఆధారాలను ఇచ్చా.. స్పష్టం చేసిన ఆళ్ల

తనకు దళితులు ఇచ్చిన ఆధారంగానే సీఐడీకి ఫిర్యాదు చేశానని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆయన సీఐడీ విచారణకు హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో కేవలం [more]

Update: 2021-03-18 07:53 GMT

తనకు దళితులు ఇచ్చిన ఆధారంగానే సీఐడీకి ఫిర్యాదు చేశానని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆయన సీఐడీ విచారణకు హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో కేవలం మంగళగిరిలోనే 500 ఎకరాల అసైన్డ్ భూముల విషయంలో మోసం జరిగిందని ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. తాను సీఐడీ కి పూర్తి ఆధారాలు, సమాచారానని ఇచ్చానని ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. రెవెన్యూ శాఖ పరిధిలోని భూములను మున్సిపల్ శాఖ ఎలా ఇస్తుందని ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు తప్పు చేయకుంటే విచారణను ఎదుర్కొనాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.

Tags:    

Similar News