పరిషత్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు అధికారుల అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరిషత్ ఎన్నికలు ఈరోజున జరగనున్నాయి. రాష్ట్రంలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ [more]

Update: 2021-04-08 01:06 GMT

ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు అధికారుల అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరిషత్ ఎన్నికలు ఈరోజున జరగనున్నాయి. రాష్ట్రంలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశామని పోలీసు అధికారులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ ధైర్యంగా తన ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని కోరారు. కోవిడ్ నిబంధలను పాటిస్తూ ఎన్నికలను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. కోర్టు తీర్పు కూడా అనుకూలంగా రావడంతో ఎన్నికల ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.

Tags:    

Similar News