మంత్రి అఖిలప్రియను భర్తరఫ్ చేయాలి...

Update: 2018-06-07 08:33 GMT

ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించిన ఏపీ మంత్రి అఖిలప్రియను క్యాబినెట్ నుంచి భర్తరఫ్ చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గవర్నర్ నరసింహన్ ను కోరారు. ఈ మేరకు గురువారం ఆయన ఇతర బీజేపీ నేతలతో కలిసి గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు.

టీడీపే నేతలు రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని, దుర్మార్గాలకు తెగబడుతున్నారని వివరించారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ...టీడీపీ నేతలు సంస్కారం మరిచి ప్రధాని మోడీని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని ఆరోపించారు. కొందరు పోలీసు అధికారులు టీడీపీ నేతల్లా ప్రవర్తిస్తున్నారని, పోలీస్ స్టేషన్లు టీడీపీ నేతలకు కార్యాలయాల్లా మారిపోయాయని పేర్కొన్నారు. ప్రభుత్వ డబ్బుతో ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు ఎదుటే ప్రధానిని హీనమైన భాషతో దూషించడం సరికాదన్నారు. అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదనే విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్లాన్ లో భాగంగానే బీజేపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని, అమిత్ షా తిరుపతికి వస్తే రాక్షసంగా వ్యవహరించారని ఆరోపించారు.

Similar News