రాజమండ్రిని చంద్రబాబుకు కానుకగా ఇద్దాం

రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికల్లో మరోసారి టీడీపీని గెలిపించి చంద్రబాబుకు కానుకగా ఇద్దామని టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ పిలుపు నిచ్చారు. ఇప్పటికే మూడుసార్లు రాజమండ్రి ప్రజలు టీడీపీని [more]

Update: 2021-03-21 01:43 GMT

రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికల్లో మరోసారి టీడీపీని గెలిపించి చంద్రబాబుకు కానుకగా ఇద్దామని టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ పిలుపు నిచ్చారు. ఇప్పటికే మూడుసార్లు రాజమండ్రి ప్రజలు టీడీపీని ఆదరించారని, నాల్గోసారికూడా విజయాన్ని అందించాలని ఆదిరెడ్డి భవానీ కోరారు. రాజమండ్రిలో టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని తెలిపారు. వైఎస్ జగన్ ప్రభుత్వం టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతుందని ఆదిరెడ్డి భవానీ ఆరోపించారు. అక్రమ కేసులపై ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఆదిరెడ్డి భవానీ అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News