ఏడాది నుంచి ఆయనకు రాష్ట్రంతోనే సంబంధం లేదు

ఏడాది నుంచి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు రాష్ట్రంతో సంబంధం లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఆయన ఢిల్లీకి, హైదరాబాద్ కు మాత్రమే పరిమితమ య్యారన్నారు. వైసీపీ [more]

Update: 2021-05-17 01:38 GMT

ఏడాది నుంచి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు రాష్ట్రంతో సంబంధం లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఆయన ఢిల్లీకి, హైదరాబాద్ కు మాత్రమే పరిమితమ య్యారన్నారు. వైసీపీ గుర్తు మీద గెలిచిన ఆయన పార్టీ అధినేత మీద విమర్శలు చేయడమేంటని ఆదిమూలపు సురేష్ విమర్శించారు. తన నియోజకవర్గానికి ధైర్యంగా రాలేని వ్యక్తి ప్రజా ప్రతినిధిగా ఉండటానికి అర్హుడు కాడన్నారు. ఆయన పై కేసు నమోదు చేసి మంచి పని చేశారని ఆదిమూలపు సురేష్ అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News