ఇలాగే చేస్తుంటే చూస్తూ ఊరుకోం

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ప్రకాశం జిల్లాలో టీడీపీ కార్యకర్తలపై జరిగిన దాడులపై ఆయన స్పందించారు. [more]

Update: 2021-06-24 04:22 GMT

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ప్రకాశం జిల్లాలో టీడీపీ కార్యకర్తలపై జరిగిన దాడులపై ఆయన స్పందించారు. టీడీపీ కార్యకర్తలపై దాడులే లక్ష్యంగా వైసీపీ నేతలు పెట్టుకున్నారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 27 మంది టీడీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారన్నారు. ఈ కేసుల్లో ఒక్కరినైనా పట్టుకున్నారా? అని అచ్చెన్నాయుడు డీజీపీని ప్రశ్నించారు. ఇలాగే జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. పరిశ్రమలతో కళకళలాడాల్సిన నవ్యాంధ్య దాడులు, అరెస్ట్ లతో వెలవెలపోతుందన్నారు అచ్చెన్నాయుడు. ఏపీలో టీడీపీ కార్యకర్తలకు రక్షణ లేదన్నారు.

Tags:    

Similar News