తిరుపతిలో రీపోలింగ్ నిర్వహించాలి.. అచ్చెన్న డిమాండ్

తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రీపోలింగ్ నిర్వహించాలని టీడీపీ రాష్ట్ర అధ్కక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాయనున్నట్లు [more]

Update: 2021-04-17 06:03 GMT

తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రీపోలింగ్ నిర్వహించాలని టీడీపీ రాష్ట్ర అధ్కక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాయనున్నట్లు ఆయన తెలిపారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పెద్దయెత్తున దొంగ ఓట్లను పోల్ చేశారని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తుల చేత ఓట్లు వేయించారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. అధికారులు, పోలీసులు కూడా వైసీపీ మద్దతుదారులుగా మారిపోయారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. తాము ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News