హైకోర్టులో అచ్చెన్న కు ఊరట

మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనను ప్రయివేటు ఆసుపత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి బాగా లేదని, ఆయనను [more]

Update: 2020-07-08 05:54 GMT

మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనను ప్రయివేటు ఆసుపత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి బాగా లేదని, ఆయనను ప్రయివేటు ఆసుపత్రికి తరలిస్తే, ఆఖర్చును ఆయనే భరిస్తారని అచ్చెన్నాయుడు తరుపున న్యాయవాది పిటీషన్ వేశారు. దీనికి ప్రభుత్వం తరుపున న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే దీనిని హైకోర్టు తోసిపుచ్చింది. అయితే అచ్చెన్నాయుడును గుంటూరులోని రమేష్ ఆసుపత్రికి తరలించే అవకాశాలున్నాయి.

Tags:    

Similar News