తిరుమలలో ఇక సులువుగా వసతి

భ‌క్తుల సౌక‌ర్యం కోసం జూన్ 12వ తేదీ శ‌నివారం ఉద‌యం 8 గంట‌ల నుండి తిరుమ‌ల‌లోని ఆరు ప్రాంతాల్లో నూత‌నంగా టిటిడి ఏర్పాటు చేసిన కౌంట‌ర్లలో వ‌స‌తి [more]

Update: 2021-06-11 03:54 GMT

భ‌క్తుల సౌక‌ర్యం కోసం జూన్ 12వ తేదీ శ‌నివారం ఉద‌యం 8 గంట‌ల నుండి తిరుమ‌ల‌లోని ఆరు ప్రాంతాల్లో నూత‌నంగా టిటిడి ఏర్పాటు చేసిన కౌంట‌ర్లలో వ‌స‌తి గ‌దుల కొర‌కు పేర్లు రిజిస్ట్రేష‌న్ చేసుకునే అవ‌కాశాన్ని టిటిడి క‌ల్పిస్తోంది. ఇప్పటి వ‌ర‌కు తిరుమ‌ల‌లోని వ‌స‌తి కోసం సిఆర్‌వో వ‌ద్ద పేర్లు రిజిస్ట్రేష‌న్ మ‌రియు గ‌దులు కేటాయిస్తున్న విష‌యం విదిత‌మే. శ‌నివారం నుండి జిఎన్‌సి టోల్‌గేట్ వ‌ద్ద ఉన్న ల‌గేజి కౌంట‌ర్ నందు రెండు కౌంట‌ర్లు, బాలాజి మెయిన్ బ‌స్టాండ్ వ‌ద్ద రెండు కౌంట‌ర్లు, కౌస్తుభం అతిథి భ‌వ‌నం వ‌ద్ద ఉన్న కారు పార్కింగ్ ప్రాంతంలో రెండు కౌంట‌ర్లు, రాంబగీచ బ‌స్టాండ్ వ‌ద్ద రెండు కౌంట‌ర్లు, ఎమ్‌బిసి ప్రాంతంలోని శ్రీ‌వారి మెట్టు వ‌ద్ద రెండు కౌంట‌ర్లు, సిఆర్‌వో వ‌ద్ద రెండు కౌంట‌ర్లలో భ‌క్తులు వ‌స‌తి కోర‌కు పేర్లు రిజిస్ట్రేష‌న్ చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పేర్లు రిజిస్ట్రేష‌న్ చేసుకున్న భ‌క్తుల‌కు ఎస్ ఎమ్ ఎస్ ద్వారా వారికి కేటాయించిన గ‌దుల స‌మాచారం తెలియ‌జేస్తారు. అనంత‌రం వారికి గ‌దులు కేటాయించిన ప్రాంతాల్లోని ఉప విచార‌ణ కార్యాల‌యాల వ‌ద్ద రుసుం చెల్లించి గ‌దులు పొంద‌వ‌చ్చు. ఈ అవ‌కాశాన్ని భ‌క్తులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరుతున్నారు.

Tags:    

Similar News