ముగ్గురు అక్కాచెల్లెళ్లకు బాల్య వివాహాలు చేశారు.. బావిలో శవాలయ్యారు

మమతా దేవి, కమలేష్ ఇద్దరూ నిండు గర్భిణులు కావడం.. కాలు దేవి కేవలం నెల రోజుల క్రితమే ప్రసవించింది. కష్టపడి చదువుకుని..

Update: 2022-05-29 06:27 GMT

రాజస్థాన్ రాష్ట్రంలో ఘోరం చోటు చేసుకుంది. జైపూర్ జిల్లాలోని ఓ బావిలో శనివారం నాడు ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. చనిపోయిన మహిళలు తోబుట్టువులని తేలింది. కాలు దేవి, మమత, కమలేష్‌ లు అక్కా చెలెళ్ళని గుర్తించారు. ముగ్గురు మహిళలు కాలు దేవి(27), మమతా(23) దేవి, కమలేష్‌(20) అక్కాచెల్లెల్లుగా గుర్తించారు. నాలుగేళ్ల చిన్నారి, 27 రోజుల శిశువును కాలుదేవి పిల్లలుగా గుర్తించారు. ముగ్గురు అక్కాచెల్లెల్లు బాల్య వివాహ బాధితులే అని తెలుస్తోంది. పెద్దగా చదువుకోని, మద్యం అలవాటు ఉన్న ముగ్గురు అన్నదమ్ములకిచ్చి వీరి వివాహాలు చేశారు.

మమతా దేవి, కమలేష్ ఇద్దరూ నిండు గర్భిణులు కావడం.. కాలు దేవి కేవలం నెల రోజుల క్రితమే ప్రసవించింది. కష్టపడి చదువుకుని జీవనం సాగించాలనుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లను మద్యం మత్తులో ఉండే వ్యక్తులకు ఇచ్చి పెళ్లి చేసినట్లు సమాచారం. అది కూడా బాల్య వివాహం అని తేలింది. వీరు బుధవారం నాడు అదృశ్యమయ్యారు. వారిని వెతకడంలో పోలీసులు విఫలమయ్యారు. ముగ్గురు మహిళలు గృహహింసకు గురైనట్లు సమాచారం. కాలు దేవిని అత్తమామలు కొట్టడంతో.. 15 రోజులు క్రితం ఆసుపత్రి పాలైంది. వారి ముగ్గురికి 2003లో బాల్య వివాహం జరిగింది. ఆ సమయంలో అక్కచెల్లళ్ళలో ఆఖరి అమ్మాయి వయసు కేవలం 1 సంవత్సరం మాత్రమే. ఆ ముగ్గురు మహిళలు తమ బతుకుదెరువు కోసం కష్టపడి చదువుకున్నారు. మమత పోలీసు కానిస్టేబుల్ పరీక్షలో ఎంపికైంది, కలు తన బిఎ కోర్సు చివరి సంవత్సరం చదువుతోంది, చిన్న చెల్లెలు కమలేష్ సెంట్రల్ యూనివర్సిటీలో చేరింది. అయినా కూడా భర్తలు టార్చర్ పెడుతూనే ఉన్నారు. వారి ఇళ్లకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న బావి నుంచి శనివారం వారి మృతదేహాలను వెలికితీశారు. మహిళలు, వారి పిల్లలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారా లేక వరకట్నం కోసం అత్తమామలే హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వారి భర్తలు వారిని వరకట్నం కోసం వేధించేవారు. మే 25న కమలేష్ తన తండ్రికి ఫోన్ చేసి, తమను తమ భర్తలు, వారి బంధువులు కొడుతున్నారని, తమకు చాలా భయంగా ఉందని చెప్పారు. వెంటనే డూడూ గ్రామానికి చేరుకోగా అల్లుళ్లు ''వాళ్ళు చనిపోయారు, మాకేమీ తెలియదు. నువ్వు వెళ్ళిపో, లేదంటే నువ్వు కూడా చస్తావు'' అని బెదిరించారు. ఈ అక్కచెల్లెళ్ళు, వారి పిల్లలు కనిపించడం లేదని బుధవారం ఓ ఫిర్యాదు డూడూ పోలీస్ స్టేషన్‌లో దాఖలైంది. గురువారం కేసు నమోదు చేశారు. ఇప్పుడు వారు శవాలై బావిలో కనిపించారు.


Tags:    

Similar News