కేసీఆర్ కు మనసు లేదు

రైతుల సంక్షేమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా విస్మరించారని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు.

Update: 2022-01-27 09:36 GMT

రైతుల సంక్షేమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా విస్మరించారని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో రైతులను పట్టించుకోని కేసీఆర్ దేశాన్ని ఏలుతారట అంటూ షర్మిల ఎద్దేవా చేశారు. కనీసం ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు కూడా కేసీఆర్ భరోసా ఇవ్వడం లేదని అన్నారు.

ఆత్మహత్యలు.....
కౌలు రైతులు రైతులు కాదా? అని షర్మిల ప్రశ్నించారు. వ్యవసాయ విత్తనాలను సబ్బిడీలను ఇచ్చే విధానమే కేసీఆర్ ఎత్తివేశారని ఆరోపించారు. రైతులపై కేసీఆర్ కు ఎందుకంత కక్ష అని షర్మిల ప్రశ్నించారు. వయసుతో నిమిత్తం లేకుండా అందరూ రైతులకు బీమాను వర్తింప చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. యూపీలో కేసీఆర్ ప్రచారం పెద్ద జోక్ అని అన్నారు.


Tags:    

Similar News