సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల ఫైర్

వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫైర్ అయ్యారు.

Update: 2021-11-29 07:45 GMT

వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. కరోనా ముంచుకొస్తుందని కొంచెం పట్టించుకోమని షర్మిల ఎద్దేవా చేశారు. కరోనా సెకండ్ వేవ్ లో ఆక్సిజన్, బెడ్ల కొరతతో ప్రజలు పిట్టల్లా రాలిపోయారన్న విషయాన్ని వైఎస్ షర్మిల గుర్తు చేశారు. పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందని చెప్పి ప్రజల ప్రాణాలను గాలికి వదిలేశారని షర్మిల ముఖ్యమంత్రి కేసీఆర్ పై ధ్వజమెత్తారు.

ఈసారైనా....?

మరోసారి కరోనా విజృంభిస్తున్న నిపుణుల హెచ్చరికలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవలని వైఎస్ షర్మిల సూచించారు. కరోనా ను ఆరోగ్య శ్రీలో చేర్చాలని కూడా షర్మిల డిమాండ్ చేశారు. వైద్యం అందరికీ ఉచితంగా అందేలా చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరికి రెండు డోసుల వ్యాక్సిన్లను అందించాలని కోరారు.


Tags:    

Similar News